ఇండోనేషియా దేశంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం బాంటెన్ ప్రావిన్స్ జైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో 40 మందికి పైగా ఖైదీలు మరణించారు. బాంటెన్ ప్రావిన్సు జైలులో బుధవారం తెల్లవారుజామున 1గంట నుంచి మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకశాఖ వాహనాలను రప్పించి చర్యలు చేపట్టారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర అగ్నిప్రమాదంలో 40 మంది మరణించారని ఇండోనేషియా న్యాయ, మానవహక్కుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రియంతి తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.