ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి వెళ్లిన ఓ పాకిస్థాన్ మంత్రి రిబ్బన్ను కత్తెరతో కాకుండా పళ్లతో కొరికిపారేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పాక్ మంత్రి తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పాక్ మంత్రి ఫయాజ్ ఉల్ హసన్ చౌహాన్ తాజాగా లాహోర్లో కొత్తగా నిర్మించిన ఓ దుకాణాన్ని ప్రారంభించడానికి వెళ్లారు.
దుకాణ ప్రవేశ ద్వారం వద్ద కట్టిన రిబ్బన్ ను ఆయన కట్ చేసి లోపలికి వెళ్లాల్సి ఉంది. దాని కోసం నిర్వాహకులు కత్తెర కూడా తీసుకొచ్చారు. అయితే, ఆ కత్తెర పదునుగా లేదు. ఎంతగా ట్రై చేసినా అది కట్ కాలేదు. దీంతో ఆ మంత్రికి కోపం వచ్చింది. షాపు యజమానిని తిట్టుకుంటూ పళ్లతోనే రిబ్బన్ కట్ చేశారు. అక్కడున్న వారు నవ్వు ఆపుకోలేకపోయారు. ఆయన తీరుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.