ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో తుపాను అలజడి..రాత్రికి రాత్రే 44 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Fri, Sep 03, 2021, 11:38 AM

అమెరికాను వరుస హరికేన్లు వణికిస్తున్నాయి. తాజాగా ఇడా తుపాను పంజా విసురుతోంది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలు న్యూయార్క్ లో విషాదాన్ని నింపాయి. ఆకస్మికంగా సంభవించిన వరదల కారణంగా రాత్రికి రాత్రే కనీసం 44 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలను 'చారిత్రాత్మక వాతావరణ సంఘటన'గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. వరదల వల్ల న్యూయార్క్ వీధులు నదుల్లా మారాయి. సబ్ వే లోని ట్రాకులన్నీ నీట మునగడంతో సబ్ వే సేవలను ఆపేశారు. వరద బీభత్సం నేపథ్యంలో న్యూయార్క్ లో ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com