కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హార్ధిప్ సీంగ్ పూరీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అని తెలిపారు. చమురు ఉత్పత్తుల పన్నులపై అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో విశాఖపట్నంను ఏపీ రాజధానిగా పేర్కొనడం కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందన్నారు. జరిగిన తప్పును సరిద్దిదేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. అమరావతిని ఏపీ రాజధానిగా పేర్కొంటూ ప్రకటన జారీ చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖలో పేర్కొన్నారు.