ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 27, 2021, 03:32 PM

ఆ కన్నతల్లికి ఎంత కష్టం వచ్చిందో.. ముక్కుపచ్చలారని ఇద్దరు పసికందులతో సహా చనిపోవాలని నిర్ణయించుకుంది. విజయవాడకు చెందిన రుద్ర వరపు శాంతిప్రియ శుక్రవారం తన ఇద్దరు పిల్లలతో గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని బంకింగ్ హోమ్ కెనాల్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అప్పుడే విధులకి వెళుతున్న కృష్ణానది చెక్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు వీళ్ళ ఆత్మహత్య ప్రయత్నాన్ని గమనించి స్థానిక మత్స్యకారుల సహాయంతో ముగ్గురు ప్రాణాలు రక్షించారు.  


తల్లి, పిల్లలతో సహా ప్రాణాలతో ముగ్గురు దక్కడంతో స్థానికులు, శాంతిప్రియ కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం శాంతి ప్రియ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తల్లి, పిల్లల్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com