జిల్లాలోని పిడుగురాళ్లలో వైసీపీ కౌన్సిలర్ జానీపై కొందరు గుర్తుతెలియని దుండగులు దాడికి తెగబడ్డారు. తీవ్ర గాయాలవ్వడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. దాడి చేసిందెవరు..? ఎందుకు ఈ దాడి జరిగింది..? ఈ దాడి వెనుక ఎవరున్నారు..అనే విషయాలు తెలియరాలేదు. కాగా.. పేకాటలో వచ్చిన గొడవలే ఈ దాడికి కారణమని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.