ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 19, 2021, 02:31 PM

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో పాఠశాలల సమయాన్ని మూడున్నర గంటలు పొడిగించింది. ఉదయం గంటా 45 నిముషాలు, సాయంత్రం గంటా 45 నిముషాల సమయాన్ని పొడిగించింది. ఈ మేరకు స్టేట్ ఎడ్యుకేషన్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ కౌన్సిల్ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది.


హైస్కూళ్ల సమయాన్ని మొత్తం 10 గంటలుగా నిర్ధారించారు. ఆప్షనల్ సబ్జెక్టులు, లంచ్ బ్రేక్ కోసం పెంచిన సమయాన్ని కేటాయించారు. ప్రీ హయ్యర్, హయ్యర్, హయ్యర్ ప్లస్ స్కూళ్లు ఉ.8 గంటల నుంచి సా.6 గంటల వరకు పనిచేస్తాయి


శాటిలైట్‌ ఫౌండేషన్‌ స్కూళ్లు (పీపీ-1, 2) ఉ.9.05 నుంచి సా.3.30 వరకు ఉంటుంది. ఉ.11.50 నుంచి మ.1.50 వరకు పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాస్, లంచ్ విరామం ఉంటాయి.


ఫౌండేషన్‌, ఫౌండేషన్‌ ప్లస్ స్కూళ్లు ఉ.8 నుంచి సా.4.30 వరకు ఉంటుంది. ఉ.8 నుంచి 8.45 గంటల వరకు రీడింగ్ క్లాస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఉంటుంది. సా.3.30 నుంచి 4.30 గంటల వరకు స్పోర్ట్స్, లైబ్రరీ ఆప్షనల్ గా నిర్వహిస్తారు.


ఈ అకడమిక్ ఇయర్ లో స్కూళ్లు 188 రోజుల పాటు పనిచేస్తాయి. ఏప్రిల్‌ 30 వరకు తరగతులు నిర్వహిస్తారు. అనంతరం సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. సమ్మెటివ్‌-1 పరీక్ష 6 నుంచి 10 తరగతులకు డిసెంబరు 27 నుంచి జనవరి 7 వరకు, సమ్మెటివ్‌-2 పరీక్ష 6 నుంచి 9 తరగతులకు ఏప్రిల్‌ 18 నుంచి 29 వరకు నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com