ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పథకాల కోసం పేద ప్రజల పాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 19, 2021, 01:51 PM

పేద ప్రజల కోసం ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశ పెడుతూ ఉంటాయి. పెన్షన్, రేషన్ తో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు వివిధ రకాలుగా పేదలకు అందిస్తూ ఉంటుంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పేద ప్రజలకు పాట్లు తప్పటం లేదు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలలో ఉన్న లోపాలను సవరించేందుకు తీసుకునే చర్యల వల్ల పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి అందవలసిన పథకాలు, పథకాల వల్ల కలిగే లబ్ధిని కోల్పోతూ ఉంటారు.


అంతేకాకుండా తిరిగి ఆ పథకాలు పొందేందుకు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ అధికారుల చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇటీవల ప్రజలు ఎదుర్కొంటున్న ఈకేవైసీ సమస్యనే ఉదాహరణ. ఇలా ప్రభుత్వాలు మారిన ప్రతిసారి పథకాలలో అవకతవకలు జరిగాయని లేదా అనర్హులకు లబ్ధి చేకూరుతుందన్న ఆలోచనతో ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


పథకాలే కాదు పెన్షన్, రేషన్ విషయాలలో కూడా పేద ప్రజలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వారు కోల్పోయిన పథకాన్ని తిరిగి పొందేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు పలు రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పెన్షన్, రేషన్ విషయాలలో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉందని అనే చెప్పాలి.


మరి ప్రభుత్వాలు మారినా ప్రతిసారి పథకాలలో అవకతవకలు జరిగాయని, లేదా అనర్హులకు పథకాల ఫలాలు అందాయి అని ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో ఎంతోమంది పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక కుటుంబానికి లేదా ఒక పేదవాడికి ఒక అర్హుడుకి రేషన్, పెన్షన్ సంబంధిత ప్రభుత్వ పథకాలకు ప్రజలను అర్హులుగా గుర్తించే సమయంలో ముందుగానే తగు జాగ్రత్తలు పాటించి పథకాలకు ఎంపిక చేస్తే ఇలాంటి సమస్యలు తలెత్తవని ప్రజలు బహిరంగంగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


ఇలా ప్రభుత్వం మారినా ప్రతిసారి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని అని అంటున్నారు. మరి రానున్న రోజులలో ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో పేద ప్రజలకు ఎంతవరకు మేలు చేసే విధంగా ఎలా ముందడుగు వస్తాయో వేచి చూద్దాం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com