ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతిని వివస్త్రను చేసి దారుణం..ఆ స్టార్‌పై వందల మంది దాడి

international |  Suryaa Desk  | Published : Wed, Aug 18, 2021, 03:32 PM

మహిళలపై పాకిస్థాన్‌లో జరుగుతున్న దాడులకు ఉదాహరణగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. పాక్ స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. లాహోర్‌లోని మీనార్-ఇ- పాకిస్థాన్ సమీపంలో టిక్‌టాక్ వీడియోలు చేసుకుంటుంగా యువతిపై అల్లరి మూక దాడి చేసింది. ఆమెతో పాటు మరో ఆరుగురిపై దాడి జరిగినట్టు ఫిర్యాదులో తెలిపింది. వందల మంది తనపై దాడి చేసి ఒంటిపై బట్టలు చింపి, గాల్లోకి ఎగరేశారని యువతి వాపోయింది. మూక నుంచి తప్పించుకోడానికి ప్రయత్నించినా వదిలిపెట్టలేదు. ‘మినార్-ఇ- పాకిస్థాన్ సమీపంలోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ వద్ద జనం భారీగా ఉన్నారు. మేము వీడియోలు తీసుకుంటుండగా ఒక్కసారిగా మా వైపు దూసుకొచ్చారు.. ఒంటిపై దుస్తులను చిరిగిపోయే వరకూ నెట్టడం, లాగడం చేశారు. అక్కడున్న చాలా మంది నాకు సహాయం చేయడానికి ప్రయత్నించారు.


కానీ అల్లరి మూక ఎక్కువగా ఉండటంతో తప్పించుకోలేకపోయాను. నన్ను గాలిలో విసిరేశారు’ అని పేర్కొంది. ఈ ఘటనపై లాహోర్ పోలీసులు మంగళవారం కేసు నమోదుచేశారు. టిక్‌టాక్ యువతి, ఆమె ఇతర సహచరులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడిచేసి దోచుకున్నారని తెలిపారు. ఆమె చేతి ఉంగరం, చెవు కమ్మలు, మరో వ్యక్తి దగ్గర మొబైల్ ఫోన్, గుర్తింపు కార్డు, రూ.15,000 దోచుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు క్రూరంగా వ్యవహరించారు. ఈ ఘటనపై లాహోర్ డీఐజీ (ఆపరేషన్స్) సాజిద్ కియాన్ విచారణకు ఆదేశించారు. నిందితులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించి, వేధింపులకు గురిచేసివారు ఎవరైనా తప్పించుకోలేరని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com