అఫ్గానిస్థాన్ లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితలతో అనేక మంది ఆ దేశ పౌరులు ఇతర దేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఓ హిందూ పూజారి మాత్రం అఫ్ఘాన్ ను వీడి వెళ్లేది లేదని తేల్చి చెబుతున్నారు. పండిత్ రాజేశ్ కుమార్ అనే వ్యక్తి కాబుల్లోని రతన్నాథ్ మందిరంలో పూజారిగా సేవలందిస్తున్నారు. వందల ఏళ్ల నుండి తన పూర్వీకులు ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ వచ్చారని తాను ఇక్కడే ఉంటానని స్పష్టం చేశాడు. అఫ్గాన్ వదిలి వెళ్లే అవకాశం వచ్చినా అతడు తిరస్కరించాడు. ఒకవేళ తనను తాలిబన్లు చంపేసినా తన నిర్ణయం మారదని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో రాజేశ్ కుమార్ కు గుడిపట్ల ఉన్న విధేయతను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.