హుబ్లీ (కర్ణాటక): ఇండిగో విమానం ల్యాండింగ్ అవుతున్నపుడు దాని టైరు పేలిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ నగర విమానాశ్రయలో జరిగింది. ఇండిగో విమానం 6ఈ -7979 విమానం సోమవారం సాయంత్రం హుబ్లీలో దిగుతుండగా ఒక్కసారిగా విమానం టైరు పేలింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. విమానాశ్రయంలో ఇండిగో విమానాన్ని ఇంజినీర్లు తనిఖీలు చేస్తున్నారు.