ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు

national |  Suryaa Desk  | Published : Tue, Jun 15, 2021, 10:49 AM

ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి భారీవర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్,జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, బీహారుతోపాటు పొరుగు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి నాలుగైదు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. రాబోయే నాలుగు రోజుల పాటు తూర్పు, మధ్య, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com