ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ఆక్సిజన్ అవసరం తగ్గింది : సిసోడియా

national |  Suryaa Desk  | Published : Thu, May 13, 2021, 02:13 PM

 కరోనా ఉధృతి తగ్గినందున ఢిల్లీలో ఆక్సిజన్ వినియోగం తగ్గిందని, తమకు కేటాయించిన అదనపు ఆక్సిజన్ ను వేరే రాష్ట్రాలకు సరఫరా చేయొచ్చని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కేంద్రానికి సూచించారు. కరోనా కేసులు పెరిగినప్పుడు తమను ఆదుకున్న కేంద్రానికి, ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా భీకరంగా విజృంభించిన రోజుల్లో ఢిల్లీకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమయ్యేదని, ప్రస్తుతం వినియోగం 582 టన్నులకు పడిపోయిందని చెప్పారు. తమది బాధ్యతాయుతమైన ప్రబుత్వమని, అందుకే అదనపు ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు ఇవ్వమని కేంద్రానికి లేఖ రాశామని సిసోడియా పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com