ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత పర్యాటకులకు నో ఎంట్రీ

national |  Suryaa Desk  | Published : Wed, May 12, 2021, 01:27 PM

మాల్దీవులు: కరోనా రెండో దశ ఉద్ధృతి దృష్ట్యా మాల్దీవులు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ సహా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చే పర్యాటకులపై తాత్కాలికంగా నిషేధం విధించింది. మే 13 గురువారం నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు మాల్దీవులు ఇమ్మిగ్రేషన్‌ విభాగం ట్విటర్‌ వేదికగా ప్రకటన విడుదల చేసింది.


''దక్షిణాసియా దేశాలకు చెందిన పర్యాటకులకు మాల్దీవుల్లోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. అన్ని రకాల వీసాదారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. మే 13 నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది. గత 14 రోజుల్లో దక్షిణాసియా దేశాల్లో పర్యటించిన ఇతర దేశాల పర్యాటకులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి'' అని మాల్దీవులు ఇమ్మిగ్రేషన్‌ ట్వీట్ చేసింది. ఈ నిషేధంపై అక్కడి భారత హై కమిషన్‌ స్పందించింది. మాల్దీవులు నిర్ణయం.. ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ,అందువల్ల ఇక్కడ ఉన్న భారతీయులు తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాయబార కార్యాలయం సూచించింది.


భారత్‌ నుంచి మాల్దీవులుకు ఏటా లక్షల మంది విహారయాత్రలకు వెళ్తుంటారు. ఇటీవల కరోనా మొదటి దశ ఉద్ధృతి కాస్త తగ్గిన తర్వాత సినీ ప్రముఖులు వరుసగా మాల్దీవులు బాట పట్టిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com