పదహారేళ్ల బాలికపై అత్యాచారం కేసులో యావజ్జీర కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆశారాం బాపు బెయిల్ కోసం రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. కరోనా బారిన పడ్డ తాను ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో చికిత్స చేయించుకునేందుకు అనుమతి కావాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ సోకడంతో ఆయన ప్రస్తుతం జోథ్పూర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.గత బుధవారం శ్వాస సంబంధిత సమస్యను ఎదుర్కోవడంతో తొలుత మధుర దాస్ మథుర్ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఎయిమ్స్కు తరలించారు. కాగా జోథ్ పూర్ జైల్లో ఆశారంతో సహా 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా తాను పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై గురువారం విచారణ జరగనుంది.