ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ జూన్‌ 7 వరకు లాక్‌ డౌన్‌

international |  Suryaa Desk  | Published : Tue, May 11, 2021, 11:48 AM

కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ను విధించింది. ఈ నెల 12 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ఆ దేశ ప్రధాని ముహ్యుద్దీన్‌ యాసిన్‌ ప్రకటించారు. సామాజిక సమావేశాలతో పాటు అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలన్నీ నిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యా సంస్థలు మూసివేబడుతాయని.. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మలేషియా కరోనా థర్డ్‌ వేవ్‌ ను ఎదుర్కొంటోందని, ఇది జాతీయ సంక్షోభాన్ని రేకెత్తిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో లాక్‌ డౌన్‌ అత్యవసరమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com