అసలే కరోనా కాలం.. ఆపై పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుల పాలిట గుదిబండలా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 861 ఉంది. ఇలాంటి తరుణంలో వినియోగదారులకు పేటీఎం సంస్థ గుడ్ న్యూస్ అందించింది. గ్యాస్ బుకింగ్పై భారీ క్యాష్బ్యాక్ను ప్రకటించింది. రూ. 800 వరకు క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా మొదటిసారి పేటీఎం ద్వారా గ్యాస్ బుకింగ్ చేసుకున్నవారికే వర్తిస్తుందని స్పష్టం చేసింది.