వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమిళనాడు రాజధాని చైన్నైలో మణిమాల అనే మహిళ నివసిస్తుంది. ఆమె భర్తతో విబేధాల వల్ల వేరుగా ఉంటుంది. మణిమాలకు రెండు సంవత్సరాల క్రితం సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది వారి సహజీవనానికి దారి తీసింది. అయితే సురేష్ మణిమాలను అనుమానించేవాడు. కొంత కాలంగా ఈ విషయమై వారి మధ్య గొడవ జరుగుతుంది. బుధవారం కూడా వీరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన సురేష్ గురువారం ఉదయం మణిమాల గొంతుకు చీరను బిగించి హత్య చేశాడు. మణిమాల మరణించిన విషయం తెలుసుకున్న ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు విచారించి సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.