ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేపాల్‌లో 26 మంది ఎంపీలకు కరోనా..!

international |  Suryaa Desk  | Published : Mon, May 10, 2021, 10:28 AM
ఖాట్మండు: నేపాల్‌లో 26 మంది ఎంపీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. పార్లమెంట్ మొత్తం రెండు దశల్లో పరీక్షలు చేయించగా మొదటి దశలో 18 మంది, రెండో దశలో 8 మంది వైరస్‌ బారినపడినట్లు నేపాల్‌ పార్లమెంట్‌ కార్యదర్శి గోపాల్‌నాథ్‌ యోగి తెలిపారు. కరోనా సోకిన ఈ 26 మందిలో నలుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. దాంతో ఇవాళ పార్లమెంట్లో జరుగాల్సిన ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాసపరీక్షపై ఉత్కంఠ నెలకొన్నది.

ఓలి విశ్వాసపరీక్ష నెగ్గేనా..!

ప్రచండ నేతృత్వంలోని నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ కేపీ శర్మ ఓలి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఓలి ఇవాళ పార్లమెంట్‌లో విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్నారు. నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రస్తుతం 271 మంది ఎంపీలు ఉన్నారు. ఓలి ప్రభుత్వం విశ్వాస పరీక్ష నుంచి గట్టెక్కాలంటే కనీసం136 మంది ఎంపీల మద్దతు అవసరం. సీపీఎన్‌-యుఎంఎల్‌కు ప్రస్తుతం 121 మంది సభ్యులు ఉన్నారు. ఓలి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మరో 15 మంది మద్దతు అవసరం.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com