కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువ అవుతుండటంతో తమిళనాడు ప్రభుత్వం నేటి నుంచి 14 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ , వీకెండ్ లాక్డౌన్ పెడుతున్నాయి. కానీ వీటితో ఫలితం లేదనుకున్న రాష్ట్రాలు మళ్లీ పూర్తిగా లాక్డౌన్ పెట్టాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా ఇదే జాబితాలో తమిళనాడు కూడా చేరింది. ఈ నెల 10 నుంచి 24 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు తమిళ సర్కార్ అధికార ప్రకటన చేసింది. లాక్ డౌన్ సమయంలో అవసరమైన సేవలు మాత్రమే పనిచేయడానికి అనుమతించనున్నారు. రీసెంట్ గా తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.