కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కన్నుమూశాడు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజన్ మరణించాడు. చోటా రాజన్ పై 70కి పైగా క్రిమినల్ కేసులున్నాయి. 2015లో ఇండోనేషియా నుంచి పోలీసులు భారత్ కు తీసుకొచ్చారు. తీహార్ జైలులో రాజన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కరోనా సోకడంతో జైలు అధికారులు ఆయనను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చోటా రాజన్ కన్నుమూశాడు. చోటా రాజన్ తొలుత దావూద్ అనుచరుడు. ఆ తర్వాత ఆయనతో విబేధించి సొంతంగా గ్యాంగ్ నడిపాడు.