తమిళనాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది క్షణాల్లోనే స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా రిలీఫ్ ఫండ్ కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.4000 ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత వెంటనే ఆ ఫైల్ పై ఆయన సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం స్టాలిన్ ఆదేశించారు. రూ.4 వేలను రెండు దశల్లో ఇవ్వనున్నారు. మొదటి దశ కింద ఈ నెల రూ.2 వేలను అందచేయనున్నారు. అదే విధంగా బాలికలకు, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, పాల ధర లీటర్ కు రూ.3 తగ్గింపు పై స్టాలిన్ సంతకాలు చేశారు. ఇక నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ తెలిపారు.