బహిరంగ ప్రదేశాల్లో బురఖాలపై నిషేధం విధిస్తూ శ్రీలంక మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఈస్టర్ రోజున 9 మంది ఉగ్రవాదులు చర్చిలు, హోటళ్లపై వరుస బాంబుపేలుళకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ముసుగులు ధరించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో దేశంలో ఇకపై ముఖాన్ని పూర్తిగా కప్పే ముసుగులు ధరించరాదని మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుతం కోవిడ్ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో మాస్కులకు ఈ నిబంధన వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదిస్తే ఇది ఈ కొత్త రూల్ చట్టంగా మారనుంది.