అస్సాం లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.4 తీవ్రతగా నమోదైంది. ఈ విషయాన్ని అస్సాం ముఖ్యమంత్రి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కొద్దిసేపటి క్రితం అస్సాంలో భూకంపం సంభవించిందని, సోనిత్పూర్ జిల్లాలోని దేకియాజులి కేంద్రంగా భూకంపం సంభవిచినట్టు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ట్విట్టర్ లో దెబ్బతిన్న భవనాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన పోస్ట్ చేశారు. ఒకవైపు కరోనా మహమ్మారి అస్సాం ను వణికిస్తున్న తరుణంలో భూకంపం సంభవిచడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. అస్సాంలో భూకంపాలు తరచుగా వస్తూనే ఉంటాయి. కానీ, ఈ స్థాయిలో భూకంపం సంభవించడం కొంతమేర ఇబ్బందులు కలిగించే అంశంగా చెప్పాలి.