కరోనా వైరస్ ప్రపంచంలోని అనేక దేశాల్లో విజృంభిస్తుంది. ఇప్పుడు భారత్ లో కూడా కరోనావైరస్ వ్యాప్తి వేగంగా కొనసాగుతోంది. భారత్లో పరిస్థితి హృదయ విదారక స్థితిని కూడా మించి పోయిందని (ప్రపంచ ఆరోగ్య సంస్థ) డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సాధ్యమైన సాయం చేస్తున్నామని టెడ్రోస్ తెలిపారు. వైరస్ ను సమర్థంగా ఎదుర్కొనేలా సంస్థ తరఫున అదనపు సిబ్బంది, పరికరాలను పంపుతున్నామని తెలిపారు. 2,600 మంది అదనపు డబ్ల్యూహెచ్ఓ సిబ్బందిని భారత్కు పంపనున్నట్లు తెలిపారు. భారత్ కు సహకరించేందుకు డబ్ల్యూహెచ్ఓ అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుందని టెడ్రోస్ తెలిపారు.