మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కరుణ శుక్లా (70) కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె చత్తీస్గఢ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కరుణ శుక్లా మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి మేనకోడలు. ఆమె లోక్ సభకు చత్తీస్గఢ్ లోని జంజ్గిర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో బీజేపీకి రాజీనామా చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.