భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రభావం చూపుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా ఉండటంతో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ ను ఆ దేశం రెడ్ లిస్ట్ లో చేర్చింది. భారత ప్రయాణికులపై అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. యూకే బాటలోనే యూఎస్ వెళ్తోంది. కొద్ది రోజుల పాటు భారత్ పర్యటనకు దూరంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం ప్రజలను కోరింది. ఈ మేరకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ ప్రకటన చేసింది. తప్పని సరిగా వెళ్లాల్సి వస్తే పూర్తి స్థాయి వ్యాక్సిన్ తీసుకున్నాకే వెళ్లాలని సూచించింది. భారత్ నుంచి వచ్చే విమానాలపై హాంకాంగ్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా భారత్ లో కరోనా రోజువారీ కేసుల సంఖ్య లక్షల్లో నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది.