జపాన్ కు చెందిన ఓ సంస్థ బతికున్న నెమటోడ్ పరాన్న జీవిని పెన్నులో పెట్టి తయారు చేసింది. ఆ జీవి బయటకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో ఉన్న నీటిలో ఆ పరాన్న జీవి కదులుతూ ఉంటుంది. దీంతో వినియోగదారులు ఈ పెన్ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పెన్ను ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ పెన్ను కొనుగోలు చేయడం కోసం చాలా మంది ఆన్లైన్ లో ప్రయత్నిస్తున్నారట. ఈ పెన్నులో గల చిన్న పారదర్శక ట్యాంకులో ఈ పరాన్నజీవి కదులుతూ ఉంటుందని, దీని విలువ 950 యెన్ (రూ.651) మాత్రమేనని ఓ వినియోగదారుడు తెలిపాడు. ఈ పెన్నులో ఉండే పురుగు 4 నుంచి 5 రోజులు యాక్టీవ్గా ఉంటుందని, కాసేపు అటూ ఇటూ తిరుగుతూ ఉంటుందని అతడు వివరించాడు. కొద్ది రోజుల తర్వాత అది చనిపోతుందని తెలిపాడు.