అవినీతి కేసుల్లో ఉద్యోగులపై 100 రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పక్కా ఆధారాలతో దొరికిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఏసీబీ డీజీ, శాఖల ఉన్నతాధికారుల కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. నిర్ణీత 100 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే ఆలస్యానికి కారణం అయిన వారిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.