బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మూడేళ్ళ తరువాత తిరిగి స్వరాష్ట్రం వెళ్తున్నారు. దాణా స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ తీహార్ జైల్లో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాంచి నుంచి నేరుగా ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందించారు. బీహార్ ఎన్నికలకు ముందే లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ వస్తుందని అనుకున్నారు. కానీ, ఎన్నికలకు ముందు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. దీంతో లాలూ లేకుండానే ఈసారి ఎన్నికలు జరిగాయి. అయితే, లాలూ ప్రసాద్ స్థానంలో అయన కుమారుడు తేజస్వి యాదవ్ బాధ్యతలు తీసుకొని ప్రచారం చేసి గెలుపు వరకు పార్టీని తీసుకొచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ తిరిగి రాష్ట్రంలోకి అడుగుపెట్టబోతుండటంతో ఆర్జేడీ పార్టీ సంబరాల్లో మునిగిపోయింది.