రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. దాచేపల్లి మండలం గామాలపాడు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గుంటూరు జిజిహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.