పనాజీ : వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, రాష్ట్రంలోని 40 స్ధానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సోమవారం పేర్కొన్నారు. గోవాలో ప్రతిపక్షం బలహీనంగా తయారైందని తామే బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగామని అన్నారు.ఇక అంతకుముందు మనీష్ సిసోడియా మాజీ ముఖ్యమంత్రులు దయానంద్ బందోద్కర్, మనోహర్ పారికర్లకు నివాళులు అర్పించారు. అవినీతి రహిత రాజకీయాలను కోరుకునే వారంతా ఆప్లో చేరాలని ఆయన పిలుపు ఇచ్చారు.