ఏపీ హైకోర్టు ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. ఓ పోలీసు అధికారికి పదోన్నతి కల్పించడంలో నిర్లక్ష్యం చేసినందుకు రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శి ఈ నెల 27న తప్పకుండా తమ ఎదుట హాజరు కావాలని తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓ పోలీసు అధికారికి ప్రమోషన్ కల్పించడంలో నిర్లక్ష్యం వ్యవహరించారని కోర్టులో పిటిషన్ దాఖలు అవ్వడంతో.. కోర్టు ధిక్కారం కింద డీజీపీ, హోంశాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరు కావాలని కోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరు కాలేమని ఆ ఇద్దరు అధికారులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ పై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను హైకోర్టు ఈ నెల 27 వ తేదీకి వాయిదా వేసింది.