బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి అఖిలప్రియకు సికింద్రాబాద్ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. ధైర్యంగా ఉండాలని.. ఎన్ని కష్టాలు వచ్చినా మనోనిబ్బరంతో ముందుకు వెళ్లాలని ఫోన్లో అఖిలప్రియకు చంద్రబాబు చెప్పారు.