ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి తీసుకెళ్లలేదని 8 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే ముజఫర్నగర్ జిల్లాలోని నిర్ధాణ గ్రామంలో బుధవారం ఎనిమిదేళ్ల బాలిక ఫ్యాన్కి ఉరేసుకొని మరణించింది. బంధువుల పెళ్లికి సోదరుడిని తనను తీసుకెళ్లకుండా సోదరుడిని తీసుకెళ్లినందుకు అలిగింది. పెళ్లికి తీసుకెళ్లేందుకు తల్లి వద్దన్నందుకు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్హెచ్వో ధర్మేంద్ర సింగ్ తెలిపారు. తాము సంఘటనా స్థలానికి చేరుకునే లోపు ఆ బాలికకు అంత్యక్రియలు చేసినట్లు వెల్లడించారు. పత్వి గ్రామంలో జరిగిన పెళ్లికి తీసుకెళ్లాలని తల్లిని కోరినప్పటికీ తీసుకెళ్లకుండా.. తన సోదరుడిని తీసుకెళ్లినందుకు ఆ బాలిక మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు వివరించారు. దీనిపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.