తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గమనిక. దక్షిణ మధ్య రైల్వే రెండు రైళ్ల టైమింగ్స్ ను మార్చింది. ఇప్పటికే ఈ స్పెషల్ ట్రైన్స్ లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు మారిన టైమింగ్స్ ను దృష్టిపెట్టుకోవాలి. భారతీయ రైల్వే జూన్ 1 నుంచి 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న రైళ్లు కూడా ఉన్నాయి. ఈ 200 రైళ్ల జాబితాలో సికింద్రాబాద్-గుంటూర్ మధ్య రెండు రైళ్లు ఉన్నాయి. రైలు నెంబర్ 07201 గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రతీ రోజు గుంటూరు నుంచి సికింద్రాబాద్కు ప్రతీ రోజూ నడుస్తోంది. మొన్నటి వరకు ఈ రైలు గుంటూరులో ఉదయం 6 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకునేది.
మంగళవారం నుంచి రైలు నెంబర్ 07201 గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రతీ రోజు ఉదయం 6.25 గంటలకు గుంటూరులో బయల్దేరి సికింద్రాబాద్ కు 1.55 గంటలకు చేరుకుంటోంది. ఇకపై ఇవే టైమింగ్స్ ఉంటాయి. రైలు నెంబర్ 07201 గోల్కొండ ఎక్స్ప్రెస్ విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, వరంగల్, జనగాం, భువనగిరి, మౌలాలి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇక రైలు నెంబర్ 07202 గోల్కొండ ఎక్స్ప్రెస్ ప్రతీ రోజు సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్తుంది. ఈ రైలు మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరుతుంది. రాత్రి 9 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07202 గోల్కొండ ఎక్స్ప్రెస్ దారిలో కాజీపేట, మహబూబాబాద్, డోర్నకల్, ఎర్రుపాలెం, విజయవాడ, నంబూరు, పెదకాకాని రైల్వేస్టేషన్లలో ఆగుతుంది.