ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థిని ప్రాణం తీసిన ఆన్ లైన్ క్లాసులు..

national |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 11:08 AM

లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో.. అందరూ ఆన్ లైన్ క్లాస్ లవైపు దృష్టిమళ్లించారు. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులోని తిరవల్లూరు జిల్లా పొన్నెరీ అరుమంతై గ్రామంలో ఆన్ లైన్ క్లాసులు ఓ విద్యార్థిని ప్రాణం తీశాయి. చెన్నైలోని భారతీ ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని దర్శిని.. ఆన్ లైన్ క్లాసులు వింటోంది. అయితే ఆ క్లాసులు తనకు అర్థం కావడంలేదంటూ తల్లికి చెబుతూ వచ్చింది. నిదానంగా అర్థం అవుతాయిలేమ్మా అని తల్లి సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. క్లాసులు అర్థం కావడంలేదని, అందరిలా తాను చదువుకోలేకపోతున్నాననే బాధతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చోళవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com