నగర శివారులో దారుణం చోటు చేసుకుంది. ఏడేళ్ల బాలికపై మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. జూపార్కు పక్కన ఉన్న రిక్షాకాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎంఆర్ పల్లె పోలీసులు బాలుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.