ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రికెట్ ప్రేమికులకు శుభవార్త...ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటనకు గ్రీన్ సిగ్నల్

national |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 08:51 PM

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ క్రికెట్ అభిమానులకు శుభవార్త వినిపించారు. ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతుందని బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు.దీనిపై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇండియా టుడేతో మాట్లాడుతూ, టీమిండియా పర్యటనను బీసీసీఐ ధృవీకరించినట్లు తెలిపారు. అయితే భారత జట్టు డిసెంబర్‌లో ఆస్ట్రేలియా వెళ్లనుంది. క్వారంటైన్ రోజుల సంఖ్య కొద్దిగా తగ్గవచ్చని తాము ఆశిస్తున్నట్లు గంగూలీ తెలిపారు, ఎందుకంటే ఆటగాళ్ళు అంత దూరం వెళ్లి రెండు వారాల పాటు హోటల్ గదుల్లో కూర్చోవడం వల్ల వారిలో అసహనం, నిరాశను పెంచుతుందని గంగూలీ పేర్కొన్నారు.కరోనా విషయంలో మెల్బోర్న్ మినహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో చాలా వరకూ పరిస్థితి అదుపులోకి వచ్చిందని గంగూలీ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, తాము పర్యటనకు ఆమోదం తెలిపామన్నారు. అయితే క్వారంటైన్ విషయంలోనే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో మంతనాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com