లాలాగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది భర్తీకి దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. అందులో భాగంగా అదనపు వైద్య సిబ్బందిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించడానికి నోటిఫికేషన్ను జారీ చేసింది. లాలాగూడ సెంట్రల్ ఆస్పత్రిలో కోవిడ్ ఐసోలేషన్ కింద రైల్వే కార్మికులకు, అధికారులకు చికిత్స అందించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అదనపు సిబ్బందిని తీసుకోవాలని నిర్ణయించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే రిక్రూట్ అయిన వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తున్నట్టు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రోగులకు అవసరమైన చికిత్సను త్వరగా అందించడానికి అదనపు సిబ్బంది నియామకానికి ఉన్నతాధికారులు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టుగా రైల్వే శాఖ తెలిపింది. స్పెషలిస్టు వైద్యులు, 16 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ (జిడిఎంఓ) 31 నర్సింగ్, 04 ల్యాబ్ అసిస్టెంట్లు, 50 హాస్పిటల్స్ అటెండెంట్లు వీరి నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశామని అధికారులు తెలిపారు.దరఖాస్తుల సమర్పించడానికి ఈనెల 15 చివరితేదీ అని అధికారులు పేర్కొన్నారు. ఈ ఇంటర్వూలను ఆన్లైన్ మెకానిజం/ వీడియోకాలింగ్ ద్వారా నిర్వహిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి పోస్టు కోసం విడిగా అందించిన వెబ్ లింకుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని, ఈ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలు www.scr.indianrailways.gov.in వెబ్సైట్లో చూసుకోవాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.