కరోనా వైరస్ చైనా నుంచి పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆ తర్వాత చైనా నుంచి విపరీతమైన వ్యాధులు తెరమీదకు వస్తున్నాయి. జీ4,బుబోనిక్ ప్లేగు వ్యాధులను ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా చైనాలో పురుగుల ద్వారా మరరో వ్యాధి వస్తోందని గుర్తించినట్టు “ఇండియా టుడే” కథనం ద్వారా తెలుస్తోంది. చైనా ప్రభుత్వమే ఈ విషయాన్ని అధికారికంగా చెప్పినట్టు తెలుస్తోంది.ఏప్రిల్ 23 నుంచి ఈ వ్యాధి సోకుతుంది. బద్దె పురుగుల్లాంటి పురుగులు వెళుతూ వెళుతూ మనుషుల్ని కుడుతున్నాయి. పురుగు కుట్టిన వ్యక్తి క్రమంగా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఆ పురుగులు కుట్టిన వారికి చికిత్స చేసినా ఎటువంటి ఫలితం ఉండడం లేదు. ఈ వ్యాధిని థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (Thrombocytopenia Syndrome (SFTS) అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధితో ఐదుగురు మరణించారు. ఈ పురుగులు కుట్టిన వారికి ముందుగా నలతగా ఉండి ఆ తర్వాత జ్వరం వస్తుంది. అది పెరిగి వారి చావుకు దారి తీస్తుందని చైనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్లో ఈ వ్యాధి పుట్టుకొచ్చింది. వాస్తవానికి ఈ వ్యాధి ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2011-2016 మధ్య 5360 కేసులు నమోదయ్యాయని,వ్యాధి బారిన పడిన వారి వయస్సు 40 నుంచి 80 ఏళ్ల మధ్యలో ఉందని వారు వివరిస్తున్నారు. ఈ వ్యాధి పై చైనా వైద్యఆరోగ్యశాఖ అధికారులు దృష్టిసారించారు. అసలా పురుగులకు,వ్యాధికి సంబంధం ఏమిటనే దాని పై ఆరా తీస్తున్నారు. త్వరగా ప్రపంచమంతా ఈ వ్యాధి పట్ల అలర్ట్ కాకపోతే మరో ముప్పు తప్పేలా లేదని అంతా చర్చించుకుంటున్నారు.