ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనాలో పుట్టుకొస్తున్న మరో వైరస్

international |  Suryaa Desk  | Published : Mon, Jul 13, 2020, 08:06 PM

కరోనా వైరస్ చైనా నుంచి పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆ తర్వాత చైనా నుంచి విపరీతమైన వ్యాధులు తెరమీదకు వస్తున్నాయి. జీ4,బుబోనిక్ ప్లేగు వ్యాధులను ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. తాజాగా చైనాలో పురుగుల ద్వారా మరరో వ్యాధి వస్తోందని గుర్తించినట్టు “ఇండియా టుడే” కథనం ద్వారా తెలుస్తోంది. చైనా ప్రభుత్వమే ఈ విషయాన్ని అధికారికంగా చెప్పినట్టు తెలుస్తోంది.ఏప్రిల్ 23 నుంచి ఈ వ్యాధి సోకుతుంది. బద్దె పురుగుల్లాంటి పురుగులు వెళుతూ వెళుతూ మనుషుల్ని కుడుతున్నాయి. పురుగు కుట్టిన వ్యక్తి క్రమంగా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఆ పురుగులు కుట్టిన వారికి చికిత్స చేసినా ఎటువంటి ఫలితం ఉండడం లేదు. ఈ వ్యాధిని థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (Thrombocytopenia Syndrome (SFTS) అని వైద్య నిపుణులు అంటున్నారు. ఇప్పటి వరకు ఈ వ్యాధితో ఐదుగురు మరణించారు. ఈ పురుగులు కుట్టిన వారికి ముందుగా నలతగా ఉండి ఆ తర్వాత జ్వరం వస్తుంది. అది పెరిగి వారి చావుకు దారి తీస్తుందని చైనా ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.చైనాలోని అన్‌హుయ్ ప్రావిన్స్‌లో ఈ వ్యాధి పుట్టుకొచ్చింది. వాస్తవానికి ఈ వ్యాధి ఇప్పుడు పుట్టుకొచ్చింది కాదని శాస్త్రవేత్తలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 2011-2016 మధ్య 5360 కేసులు నమోదయ్యాయని,వ్యాధి బారిన పడిన వారి వయస్సు 40 నుంచి 80 ఏళ్ల మధ్యలో ఉందని వారు వివరిస్తున్నారు. ఈ వ్యాధి పై చైనా వైద్యఆరోగ్యశాఖ అధికారులు దృష్టిసారించారు. అసలా పురుగులకు,వ్యాధికి సంబంధం ఏమిటనే దాని పై ఆరా తీస్తున్నారు. త్వరగా ప్రపంచమంతా ఈ వ్యాధి పట్ల అలర్ట్ కాకపోతే మరో ముప్పు తప్పేలా లేదని అంతా చర్చించుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com