పాకిస్థాన్ ను కరోనా మహమ్మారి కమ్మేస్తోంది. అక్కడ సామాన్యులతో పాటు అనేక మంది ప్రముఖలు కరోనా బారిన పడి కన్నుమూస్తున్నారు. అక్కడి చట్టసభ సభ్యుల్లో అనేక మందికి కరోనా కాటేస్తోంది. పాక్ విదేశాంగ శాఖ మంత్రికి కరోనా సోకిందన్న విషయం వెలుగుచూసి వారం కూడా గడవక ముందే మరో కీలక నేతను కరోనా కాటేసింది. తాజాగా పాక్ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మిర్జాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా ప్రకటించారు. ‘కరోనా పరీక్షలో నాకు పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకు పాక్లో మొత్తం 2.31లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. మొత్తం 4,762 మంది కరోనాతో చనిపోయారు.