ముంబై సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రం రోజు రోజుకు ముందుకు వస్తోంది. జులై 4న సముద్రంలో అలల తీవ్రత ఎక్కువైంది. కెరటాలు భారీగా ఎగసిపడుతున్నాయి. దాదాపు 40 ఏళ్లుగా తీరం సమీపంలోని బంద్రా శాంతీస్లో నివసిస్తున్న బస్తీవాసుల ఇళ్లల్లోకి సముద్రపు అలలు చొచ్చుకెళ్తున్నాయి. దీంతో అధికారులు ముంబైలో అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.