ఇండియాలో గత 24 గంటల్లో మరో 24248 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకూ మొత్తం కరోనా కేసుల సంఖ్య 697287గా నమోదైంది. తాజాగా 24 గంటల్లో 425 మంది కరోనా వల్ల చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 19693కి చేరింది. కేంద్ర హెల్త్ బులెటిన్ నివేదిక ప్రకారం.. గత 24 గంటల్లో 15350 కేసులు రికవరీ అవ్వడంతో మొత్తం రికవరీల సంఖ్య 424432కి పెరిగింది. ప్రస్తుతం 253287 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.