భారత్-చైనా మధ్య లడక్ సరిహద్దు వివాదం రగులుతున్నవేళ... టిబెట్ సరిహద్దుల విషయంలో టిబెటన్లకు మద్దతుగా భారత్ ఉన్న సమయంలో... టిబెటన్ల గురువు దలైలామా... నేడు 85వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా... హిమాచల్ ప్రదేశ్లేలోని ధర్మశాలలో జరిగే కార్యక్రమాలకు భారత్ మద్దతుగా నిలవడం ఏటా జరిగేదే. ఈ కార్యక్రమాల్ని ఏటా చైనా వ్యతిరేకించడమూ కామనే. ఎందుకంటే దలైలామా టిబెట్ నుంచి వచ్చి భారత్లో శరణార్థిగా ఆతిథ్యం పొందుతున్నారు. ఇది టిబెట్ను తన అధీనంలో ఉంచుకున్న చైనాకు ఏమాత్రం నచ్చని విషయం.ఇలాంటి పరిస్థితుల్లో టిబెటన్లకు దలైలామా శాంతి సందేశం ఇచ్చారు. కరోనా విషయంలో చైనా వల్లే తమకు ఆ వైరస్ సోకిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో భారత్తో సరిహద్దు వివాదానికి తెరతీసి చైనా పెద్ద తప్పే చేసింది. భారత్ లాగా తామూ చైనా యాప్స్ని నిషేధిస్తామని చాలా దేశాలు చెబుతున్నాయి. ఇక అమెరికా అయితే చైనా అహంకారాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. దలైలామాకు ఇవాళ జరిగే కార్యక్రమాల్ని చైనా తప్పుపడితే ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కోక తప్పదు.