ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాజ్‌మహల్ సందర్శనకు మరికొన్ని రోజులు వేచిఉండాల్సిందే...

national |  Suryaa Desk  | Published : Mon, Jul 06, 2020, 01:18 PM

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్ మూసివేత మరికొన్ని రోజులపాటు కొనసాగనుంది. తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి ఇచ్చే విషయమై యూపీ ప్రభుత్వం మళ్లీ వెనక్కి తగ్గింది. ఆగ్రాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పర్యాటకులకు ప్రవేశాన్ని నిలిపివేసింది. గత నాలుగు రోజుల్లో ఆగ్రాలో కొత్తగా 55 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 71 కంటైన్మెంట్లు జోన్లు ఉన్నాయి. ఒకవేళ స్మారక చిహ్నాలను తెరిస్తే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని అధికారులు భావించారు. అప్పుడు మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి సోమవారం నుంచి తాజ్‌మహల్ తెరుచుకోవాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com