ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్మహల్ మూసివేత మరికొన్ని రోజులపాటు కొనసాగనుంది. తాజ్మహల్ సందర్శనకు అనుమతి ఇచ్చే విషయమై యూపీ ప్రభుత్వం మళ్లీ వెనక్కి తగ్గింది. ఆగ్రాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో పర్యాటకులకు ప్రవేశాన్ని నిలిపివేసింది. గత నాలుగు రోజుల్లో ఆగ్రాలో కొత్తగా 55 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 71 కంటైన్మెంట్లు జోన్లు ఉన్నాయి. ఒకవేళ స్మారక చిహ్నాలను తెరిస్తే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని అధికారులు భావించారు. అప్పుడు మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి సోమవారం నుంచి తాజ్మహల్ తెరుచుకోవాల్సి ఉంది.