భారత ప్రధాని మోడీ లడాఖ్ లో ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..."దేశమంతా మీ స్పూర్తిని ప్రశంసిస్తుంది. భారత శత్రువులకు గట్టి గుణపాఠం నేర్పారు. శాంతిని కోరుకున్నంత మాత్రాన చేతులు కట్టుకొని కూర్చోలేం. భారతమాతకు,అమరవీరులకు సెల్యూట్ చేస్తున్నాం. భారత జవాన్ల త్యాగం నిరుపమానమైంది. దైర్యవంతులే శాంతి కోరుకుంటారు. శాంతిపై భారత్ కు ఉన్న నిబద్దత నిరూపమానమైంది. ప్రపంచమంతా భారత్ శాంతిని నిశితంగా గమనిస్తోంది. భద్రతా బలగాల శౌర్యానికి నా సెల్యూట్. సరిహద్దులో జవాన్లు చేస్తున్న సాహసం అజరామరం. ఆధునిక సాంకేతికను,అభివృద్దిని భారత్ అందిపుచ్చుకుంటుంది. ఇంత కఠిన పరిస్థితిలోనూ దేశం కోసం పని చేస్తున్నారు. దేశ భద్రతంతా జవాన్ల చేతిలో ఉంది. లడఖ్ నుంచి కార్గిల్ వరకు మీ దైర్యం అమోఘం." అని ప్రధాని మోడీ అన్నారు.