ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గల్వాన్ ఘటనలో గాయపడిన జవాన్లను పరామర్శించిన మోడీ

national |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 11:42 AM

గల్వాన్ ఘటనలో గాయపడిన జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరామర్శించారు. నాటి ఘటన గురించి నేరుగా సైనికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జవాన్ల భుజం తట్టి వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. లడఖ్‌ గల్వాన్ లోయలో జూన్ 15న బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లను పొట్టనపెట్టుకుంది. ఈ ఘటనలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయినా డ్రాగన్ కంట్రీ మాత్రం ఇప్పటివరకు నోరు మెదపడం లేదు. 45 మంది దాకా చనిపోయారని కథనాలు వచ్చినా చైనా స్పష్టం చేయలేదు. గల్వాన్ ఘటన తర్వాత భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. వాస్తవాధీన రేఖ వెంబడి వేలాది మంది సైనికులను రెండు దేశాలూ మోహరించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా లడఖ్ పర్యటన చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com