చైనాకు చెందిన 59 యాప్లపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాకు చెందిన సోషల్ మీడియా వేధిక వీబోని వీడాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైంది. చైనా ట్విట్టర్గా పిలిచే వీబోలో ఉండే వీఐపీలు అకౌంట్ మూసివేయడానికి జరిగే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది.అకౌంట్ డియాక్టివేట్ చేయడానికి వీబో నుంచి అనుమతుల ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నేళ్ల క్రితం చైనా వీబోలో చేరిన మోదీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు ప్రధాని వీబోలని తన ఖాతాలో 115 పోస్టులను ఉంచారు. అకౌంట్ డియాక్టివేట్ కావడానికి సమయం పట్టే అవకాశం ఉండడంతో అందులో ఉన్న పోస్టులను తొలగిస్తున్నారు. అయినప్పటికీ మోదీ ఫాలోవర్ల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలిపాయి.