తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఆరుగురు మరణించగా పది మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలి పవర్ ప్లాంట్ లో బుధవారం ప్రమాదవశాత్తు బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో పది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్ లో మరి కొంత మంది చిక్కుకుపోవడంతో వారిని సహాయక బృందాల ద్వారా బయటికి తీసుకొచ్చారు. 3 నెలల క్రితం ఇదే ప్లాంటులో పేలుడు జరిగి 8 మంది గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే మళ్లీ ప్రమాదం జరిగింది.