ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పేలిన బాయిలర్..ఆరుగురు మృతి

national |  Suryaa Desk  | Published : Thu, Jul 02, 2020, 01:32 PM

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలి ఆరుగురు మరణించగా పది మందికి పైగా గాయపడ్డారు. కడలూరు జిల్లా నైవేలి పవర్ ప్లాంట్ లో బుధవారం ప్రమాదవశాత్తు బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో పది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం తిరుచ్చిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్ లో మరి కొంత మంది చిక్కుకుపోవడంతో వారిని సహాయక బృందాల ద్వారా బయటికి తీసుకొచ్చారు. 3 నెలల క్రితం ఇదే ప్లాంటులో పేలుడు జరిగి 8 మంది గాయపడ్డారు. ఆ ఘటన మరువక ముందే మళ్లీ ప్రమాదం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com